
- పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
జిన్నారం, వెలుగు: బొల్లారం మున్సిపల్ పరిధిలో గల జగన్నాథుడి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన రథయాత్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రథయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మినీ ఇండియాగా పేరొందిన బొల్లారం మున్సిపాలిటీలోని అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటానన్నారు.
అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్నామని తెలిపారు. పూరి జగన్నాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, హనుమంత్ రెడ్డి,అనిల్ రెడ్డి, గోపాలమ్మ, వరప్రసాద్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి పట్టణంలో జగన్నాథుడి రథయాత్రను ఘనంగా నిర్వహించారు. బలరాముడు, సుభద్ర, శ్రీకృష్ణ మూర్తులతో అలంకరించిన రథాన్ని భక్తులు హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే సంకీర్తనతో రథాన్ని లాగారు. భక్తులు నృత్యాలు చేస్తూ పీఎస్ఆర్ గార్డెన్ వరకు రథయాత్రను కొనసాగించారు. నిర్వాహకులు మాట్లాడుతూ కలియుగంలో భగవన్నామ స్మరణ ఒక్కటే కలిమాయ నుంచి కాపాడుతుందన్నారు.